|
|
ఫీల్డ్ అసిస్టెంట్లకు జీవో 2501 పి. యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి దేవయ్య, ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. పరందామయ్యలు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీలను చైతన్యపరచడం, పనుల ఎంపిక, కొలతలు వేయడం, జాబ్కార్డుల పంపిణీ, మాస్టర్రోల్, పోస్టల్ ఖాతాల నిర్వహణ తదితర పనులు నిర్వహిస్తామని, ఫలితంగా వలసలు క్రమేణా తగ్గుతున్నాయని చెప్పారు. ఇంతటి కృషి చేస్తున్న పీల్డ్ అసిస్టెంట్స్కు ప్రభుత్వం కేవలం రూ.2200లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పీల్డ్ అసిస్టెంట్స్ కుటుంబాలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ను బెదిరించిచట్ట విరుద్ధంగా యంత్రాలతో పనులు చేయించడం పనులు జరగకుండానే జరిగినట్టు తప్పుడు రికార్డులు వ్రాయిస్తున్నారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. |
|